గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గాజులమండ్యం పంచాయతీ దేశమ్మ నగర్ లో పర్యటిస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబానికి సహాయం చేశారు. గత సంవత్సరం తమ కుమారుడు శీను డయేరియాతో వాంతులు చేసుకుంటూ మరణించాడని, అప్పటినుండి తమ కుటుంబ పోషణ దారుణంగా ఉందని మీరే మాకు సహాయం చేయాలని ఎమ్మెల్యే ని కోరారు.
ఎమ్మెల్యే తక్షణమే స్పందించి వాళ్ల పిల్లల చదువులకు, కుటుంబం గడవడానికి వెంటనే తన సొంత డబ్బు రూ. 3లక్షల నగదు అందించారు. ఈ సందర్భంగా బాధితుడి కుటుంబీకులు దేవుడిలా వచ్చి ఆదుకున్న ఎమ్మెల్యే శాశ్వతంగా తమ శాసనసభ్యులుగా ఉండాలని దీవించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సంధ్య, సర్పంచ్ గంగారి రమేష్,ఎంపీటీసీ సభ్యులు జువ్వల ధనంజయరెడ్డి,వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.