38.2 C
Hyderabad
April 29, 2024 14: 20 PM
Slider కృష్ణ

నందిగామ ప్ర‌భుత్వాసుప‌త్రిలో అంద‌ని ద్రాక్ష‌గా వైద్య‌సేవ‌లు

#Nandigama Hospital

నందిగామ దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ ఆసుప‌త్రి లో వైద్యం అంద‌క రోగులు  ఇబ్బందులు ప‌డుతున్నారు. స్వయంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ క‌రోనా బారిన ప‌డి గత 15 రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

మ‌రోవైపు ముగ్గురు సిబ్బందికి క‌రోనా సోకింది. దీన్ని అదునుగా తీసుకుని వైద్య సిబ్బంది ఆసుప‌త్రికి రాకుండా ఏదో ఒక వంక‌తో డ్యూటీకి ఎగ‌నామం పెడుతున్నారు.

నందిగామ నియోజ‌క‌వ‌ర్గానికే త‌ల‌మానికంగా ఉన్న డివిఆర్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఉద్యోగులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ విధంగా విధుల‌కు హాజ‌రు కాకుండా ప‌బ్బం గ‌డుపుతూ పేద‌ల‌కు వైద్యం అందించ‌డంలో పూర్తిగా నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు.

విధుల‌కు హాజ‌రు కాకుండా వ్య‌వ‌హ‌రించ‌డంపై ఉన్న‌తాధికారులు స్పందించి విచార‌ణ జ‌రపాల‌ని, పేద‌ల‌కు నందిగామ డివిఆర్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో మెరుగైన వైద్యం అందించేలా అధికారులు కృషి చేయాల‌ని పేద‌లు కోరుతున్నారు.

Related posts

ప్రపంచం గర్వించదగిన మహనీయుడు అంబేద్కర్

Satyam NEWS

గిరిజన యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

Satyam NEWS

పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు

Murali Krishna

Leave a Comment