నందిగామ దేవినేని వెంకటరమణ ఆసుపత్రి లో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. స్వయంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ కరోనా బారిన పడి గత 15 రోజులుగా హోం క్వారంటైన్లో ఉన్నారు.
మరోవైపు ముగ్గురు సిబ్బందికి కరోనా సోకింది. దీన్ని అదునుగా తీసుకుని వైద్య సిబ్బంది ఆసుపత్రికి రాకుండా ఏదో ఒక వంకతో డ్యూటీకి ఎగనామం పెడుతున్నారు.
నందిగామ నియోజకవర్గానికే తలమానికంగా ఉన్న డివిఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఈ విధంగా విధులకు హాజరు కాకుండా పబ్బం గడుపుతూ పేదలకు వైద్యం అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
విధులకు హాజరు కాకుండా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని, పేదలకు నందిగామ డివిఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా అధికారులు కృషి చేయాలని పేదలు కోరుతున్నారు.