ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో గుబ్బగుర్తి గ్రామంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూ సేకరణ నిమిత్తం సంబంధిత రైతులతో, కలెక్టర్ నెగోషియన్ చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ చే గుబ్బగుర్తి గ్రామంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయనున్నట్లు ఆయన అన్నారు. ఇందుకై 126 ఎకరాల భూ సేకరణ చేయనున్నట్లు, రైతులతో మాట్లాడి ఎకరానికి రూ. 20 లక్షల ధర నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, కొనిజర్ల మండల తహసీల్దార్ సైదులు, కలెక్టరేట్ భూసేకరణ డిటి రంజిత్, అధికారులు తదితరులు ఉన్నారు.