తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏకతాటి మీదకు తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు. ఇందులో భాగంగా తన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ అగ్ర నేతలకు ఆయన ఉదయం అల్పాహార విందును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మానిక్యం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శులు కే. శ్రీనివాసన్, బోసు రాజు, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉదయం అల్పాహార విందుకు హజరయ్యారు.