41.2 C
Hyderabad
May 4, 2024 17: 33 PM
Slider ప్రకాశం

పెంచిన ఇంటి పన్నులు తగ్గించాల‌ని టీడీపీ నిర‌స‌న‌

Chimakurthi

రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీ పరిధిలోని ఇళ్లపై , ఖాళీ స్థలాల పై పెంచిన పన్నులు వెంటనే తగ్గించాలని కోరుతూ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చీమకుర్తిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ పెంచిన ఇంటి పన్నులు కారణంగా పేద మధ్య తరగతి ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరోనా నేపథ్యంలో పేదల కుటుంబాల ఆర్ధిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్నికమిషనర్ డి. రవికుమార్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గొల్లపూడి రాంబాబు, కార్యదర్శి అవనిగడ్డ శేషారావు, నాయకులు కందిమళ్ల గంగాధర రావు, వేల్పుల శ్రీనివాస రావు, గొట్టిపాటి రాఘవ రావు, ముప్పూరి చలమయ్య, సూరంపల్లి రామకృష్ణ, భువనగిరి వెంకాయమ్మ, అవిసినేని వెంగన్నతదితరులు పాల్గొన్నారు.

Related posts

రాత్రి 11 తర్వాత రోడ్డు పైకి వచ్చే వారిపై చర్యలు తప్పవు

Satyam NEWS

కేసీఆర్ కోసం రక్త ధారపోస్తా:కమలాకర్

Satyam NEWS

సిర్పూర్ కాగజ్ నగర్ లో బిజెపి ప్రతిష్టను మరింత పెంచుతా

Satyam NEWS

Leave a Comment