Slider మహబూబ్ నగర్

గణపసముద్రం చెరువులో మంచినీటి రొయ్యల విడుదల

niranjan 25

తెలంగాణ ప్రజలకు చేపలతో పాటు రొయ్యలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖిల్లా ఘణపురం గణపసముద్రం చెరువులో లక్షా 10 వేల నీలకంఠ మంచినీటి రొయ్యల విడుదలను నేడు ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కలెక్టర్ శ్వేతా మొహంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవకాశమున్న అన్ని చెరువులలో దశలవారీగా రొయ్యలు విడుదల చేస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో వట్టిపోయిన చెరువులు ఇప్పుడు అలుగు పారుతున్నాయని ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం అని అన్నారు. ఉచిత చేప పిల్లల విడుదలతో మత్య్యకార కుటుంబాలలో ఆర్థిక స్వావలంబన వచ్చిందని ఇదే విధంగా  కేసీఆర్ ముందుచూపుతో అన్ని రంగాలలో  ప్రగతి సాధిస్తున్నామని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తీసుకువచ్చామని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి అన్నారు.

Related posts

విజయవంతమైన సదరం క్యాంపు: 53 మంది దివ్యాంగులు హాజరు

Satyam NEWS

రిజర్వేషన్లు, విద్యార్హతలు, సిలబస్ పై దృష్టి

Sub Editor 2

గేమ్ ఛేంజర్ గా మారుతున్న ఓపీఎస్ అంశం

mamatha

Leave a Comment

error: Content is protected !!