28.7 C
Hyderabad
May 5, 2024 07: 19 AM
తెలంగాణ

మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

maareddy

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్రం భారతదేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా కూడా రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతు బంధు వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి కానుందని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో సీలింగ్‌ విధించడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో కొంతమంది దళారులు, వ్యాపారస్తులు రైతుల పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని, సరిహద్దులో గట్టి నిఘాతో దీన్ని అరికట్టాలని సూచించారు. ఇతర రాష్ట్రల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా చూడాలని, ఈ విషయంలో కలెక్టర్లు,  జాయింట్‌ కలెక్టర్లు, పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.  తెలంగాణ రాష్ట్ర రైతుకు నష్టం కలిగించే ఏ చర్యను కూడా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతున్న నేపథ్యంలో రైతులకు అందుబాటులో ఉండేలా 3406 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1447 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 36,862 మంది రైతుల నుండి 2.51 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఇందులో 2.39 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జరిగిందని ఆయన తెలిపారు. 

Related posts

హిమాచల్ గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం

Satyam NEWS

కార్మికుల ఆత్మహత్యల విషయంలో ఏం చేయలేం

Satyam NEWS

తెఫ్ట్ కంట్రోల్ :హైదరాబాద్‌లో చంబల్‌ గ్యాంగ్‌ అరెస్టు

Satyam NEWS

Leave a Comment