జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో వైజాగ్ సిటీ లో నేషనల్ కన్స్యూమర్ దినోత్సవ వేడుకలు జరిగాయి. వినియోగదారుల చట్టం పై వందల సంఖ్య లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకు ఎన్. సి. ఆర్. సి. తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ డాక్టర్ అనితా రెడ్డికి తెలంగాణా రాష్ట్ర బెస్ట్ లీడర్ అవార్డును అందచేశారు.
వైజాగ్ మేయర్ హరి వెంకట కుమారి, కన్స్నూమర్ కోర్టు జడ్జి, ఎన్. సి. ఆర్సి నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ గౌడ, రామానుజ స్వామి, లీడర్స్ కె. రామ్ రెడ్డి, సాంబమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు. ఈ అవార్డు సంతోషాన్ని అందించడమే కాక, మరింతగా బాధ్యత పెంచిందని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు.