జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శనివారం గద్వాల పట్టణంలోని MALD డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ కన్జ్యూమర్ ఫోరం సభ్యులు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు పి. చిన్న కృష్ణ, ప్రధాన కార్యదర్శి జి.వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు వి.రాఘవ గౌడ్, మీడియా ఇంచార్జి బి. అనిల్ కుమార్, పాల్గొని కన్స్యూమర్ ఫోరం వివరాలు తెలిపారు.
డీఎస్ఓ రేవతి, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీ డిప్యూటీ సీఈఓ ముసాయిదా బేగం, డిఇఓ సిరాజుద్దీన్, ఆర్టీసీ డిప్యూటీ మేనేజర్ దేవేందర్ గౌడ్, కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శివారెడ్డి, నారాయణ, ఆనంద్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.