హిమాచల్ ప్రదేశ్లో ఓపీఎస్ అంశాన్ని బలంగా ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకున్న తీరు రానున్న రోజుల్లో దేశ రాజకీయాన్ని మార్చే అవకాశం కనిపిస్తున్నది. కాంగ్రెస్ ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా తెరపైకి తెస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. పాత పెన్షన్ స్కీమ్ అంశం ప్రజలను కాంగ్రెస్కు చేర్చిందనడంలో సందేహం లేదని కాంగ్రెస్తో అనుబంధం ఉన్న సీనియర్ నేత ఒకరు అంటున్నారు.
అందుకే ఇప్పుడు ఈ అంశాన్ని రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్గా ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. హిమాచల్ప్రదేశ్లో ఓపీఎస్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద అంశంగా తీసుకువచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఓపీఎస్ అంశాన్ని ఉధృతంగా లేవనెత్తితే తమ సమస్యలను పరిష్కరిస్తామన్న పార్టీతోనే ఉద్యోగులు ఉంటారనేది వాస్తవం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈ పథకం అమల్లోకి వచ్చిందని ఆ పార్టీతో అనుబంధం ఉన్న సీనియర్ నేతలు చెబుతున్నారు.
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ అంశంతో ప్రజలు కాంగ్రెస్పై విశ్వాసం పెంచుకోవడానికి కారణం ఇదే. ఈ అంశంతోనే వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.