కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ మొదలై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా వెళ్లండ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మధ్య ఇంటి నిర్మాణ విషయంలో చిన్న ఘర్షణతో మొదలై ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. మండల కేంద్రంలో శిశుపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేస్తుండగా అట్టి నిర్మాణం అక్రమంగా చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడులలో సంజీవ్ యాదవ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
previous post
next post