ఖమ్మం మయూరి సెంటర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి రిహాబిలిటేషన్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తనిఖీ చేశారు. ప్రధాన గిర్డర్లు, బీమ్ లు , క్రాస్ గిర్డర్లు, డయాఫర్మ్ బీమ్ ల ట్రీట్మెంట్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గిర్డర్ల గ్రౌటింగ్ 45 స్పాన్స్ లకు గాను 35 పూర్తయ్యాయన్నారు.
కంటిలివర్ స్లాబ్ లకు షార్టుక్రెట్ కాంక్రీటు పనులు 15 స్పాన్స్ లకు పూర్తయినట్లు ఆయన తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని, మెన్, మెటీరియల్ పెంచి, సెప్టెంబర్ 15 కల్లా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ పర్యటన సందర్భంగా ఆర్ అండ్ బి ఇఇ శ్యామప్రసాద్, డిఇ చంద్రశేఖర్, ఏఇఇ విశ్వనాథ్, అధికారులు తదితరులు ఉన్నారు.