27.7 C
Hyderabad
May 4, 2024 09: 32 AM
Slider ఖమ్మం

సెప్టెంబర్ 15కల్లా పనులు పూర్తి కావాలి

#Khammam Mayuri

ఖమ్మం మయూరి సెంటర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి రిహాబిలిటేషన్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తనిఖీ చేశారు. ప్రధాన గిర్డర్లు, బీమ్ లు , క్రాస్ గిర్డర్లు, డయాఫర్మ్ బీమ్ ల ట్రీట్మెంట్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గిర్డర్ల గ్రౌటింగ్ 45 స్పాన్స్ లకు గాను 35 పూర్తయ్యాయన్నారు.

కంటిలివర్ స్లాబ్ లకు షార్టుక్రెట్ కాంక్రీటు పనులు 15 స్పాన్స్ లకు పూర్తయినట్లు ఆయన తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని, మెన్, మెటీరియల్ పెంచి, సెప్టెంబర్ 15 కల్లా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్ పర్యటన సందర్భంగా ఆర్ అండ్ బి ఇఇ శ్యామప్రసాద్, డిఇ చంద్రశేఖర్, ఏఇఇ విశ్వనాథ్, అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

యువ‌త కోసం 20 రోజుల డిజిట‌ల్ మార్కెటింగ్ ఉచిత శిక్ష‌ణ ప్రారంభం

Satyam NEWS

చివ‌రి విడ‌త ఎన్నిక‌ల్లో మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల‌పై దృష్టి

Satyam NEWS

ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి కిడ్నాప్: నామినేషన్ ఉపసంహరణ

Bhavani

Leave a Comment