జగన్ ప్రభుత్వం కొత్తగా మంచి నీటి పధకాలను తెచ్చే పరిస్థితి కనిపించటం లేదని విజయనగరం జిల్లా టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే విజయనగరం కు సరఫరా అవుతున్న మంచి నీటి పధకం లో పరిశీలన లోపించి…తద్వారా బురదనీరు సరఫరా అవుతోందని..వాటిని పరిష్కరించాలని కోరారు టీడీపీ నేతలు విజయనగరం కలెక్టరేట్ లో జరిగిన స్పందన లో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ…
విజయనగరం లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజాస్వామ్య బద్దంగా డిమాండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ నేతలు ఐవీపీ రాజు ,ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ తదితరులు… . మాట్లాడుతూ విజయనగరం లో వేసవి రాకముందే మంచి నీటి ఎద్దడి మొదలైందన్నారు.తాగునీటి సమస్య పరిష్కారం పై కార్పొరేషన్ అధికారులు దృష్టి పెట్టాలని కోరారు.
ఇటీవలే విజయనగరం కు మంచి నీటి సరఫరా అవుతున్న ముషిడిపల్లి వద్ద పైప్ లైన్ లీక్ అయి..తాగునీరు సరఫరా కు అడ్డంకి ఏర్పడిందన్న విషయం తమ వద్దకు వచ్చిందన్నారు. తక్షణమే ఆ పైప్ లైన్ లీకేజీ తో పాటు అక్కడే ఇసుక అక్రమరవాణా పై కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దృష్టి పెట్టాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చామని చెప్పారు… టీడీపీ నేతలు.