39.2 C
Hyderabad
May 4, 2024 19: 44 PM
Slider ప్రపంచం

భారత్‎కు మరో మూడు రఫెల్ యుద్ధ విమానాలు..

ఫ్రాన్స్ నుంచి మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు రానున్నాయి. ఈ మూడింటింతో కలిపి భారత్‎లో రఫెల్ యుద్ధవిమానాల సంఖ్య 29కి చేరనుంది. ఉత్తర సరిహద్దులు, తూర్పు సరిహద్దులలో వీటిని మోహరించనున్నారు. తూర్పు లఢఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అత్యధునిక యుద్ధ విమానాలు రాఫెల్స్‌ను కూడా రక్షణ కోసం సరిహద్దులోకి మోహరించారు.

మొదటి విడతలో ఐదు రఫెల్ యుద్ధ విమానాలు 2020 జూలై 20న ఇండియాకు చేరుకున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ఏడాది జూలై 28 న ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ (EAC) లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హసిమారాలో నంబర్ 101 స్క్వాడ్రన్‌లో రాఫెల్ విమానాన్ని లాంఛనంగా ప్రవేశపెట్టింది.

Related posts

వరద ముంపుకు గురైన బుడగ జంగాల ను ఆదుకుంటాం

Satyam NEWS

పాకిస్తాన్ లో దేశం పరువు తీసిన కాంగ్రెస్ నేత

Satyam NEWS

అడగకుండానే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు

Satyam NEWS

Leave a Comment