24.7 C
Hyderabad
March 26, 2025 09: 50 AM
Slider జాతీయం

పాకిస్తాన్ లో దేశం పరువు తీసిన కాంగ్రెస్ నేత

#Shashi Tharoor

పాకిస్తాన్ లోని లాహోర్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ నాయకుడు శశిధరూర్ భారత ప్రభుత్వం పై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాధి అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పాకిస్తాన్ లో వ్యాఖ్యానించారు. అంతే కాదు కరోనా వ్యాధిని అరికట్టే విధానంలో ముస్లింలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపించిందని ఆయన బాధ్యతాహరితమైన వ్యాఖ్యలు చేశారు.

దాంతో ఒక్క సరిగా బిజెపి నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. బహుశ వచ్చే ఎన్నికలలో రాహుల్ గాంధీ లాహోర్ నుంచి పోటీ చేస్తాడేమో అని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు.

దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ నాయకుడు శశిధరూర్ పాకిస్తాన్ లో మాట్లాడటం అత్యంత దారుణమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

చిరు ధాన్యాల ఆహారం శ్రేష్టం

Murali Krishna

మైనర్ బాలికపై వాలంటీర్ అత్యాచారం

Satyam NEWS

గిఫ్ట్: శ్రీ పద్మావతి అమ్మవారికి వెండి ఆవు, దూడ

Satyam NEWS

Leave a Comment