మోడీ నిరంకుశత్వానికి నేటి సుప్రీంకోర్టు తీర్పు గొడ్డలిపెట్టని ఓబీసీ సెల్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు లక్కరసు సూర్యవర్మ, టిపిసిసి కార్యదర్శి దేవులపల్లి యాదగిరిలు అన్నారు. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ కి స్టే లభించడంతో చిన్నకోడూర్ మండల కేంద్రంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు.
ఈ సుందరంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ తో కలసి సూర్యవర్మ, యాదగిరిలు మాట్లాడుతూ మోడీ అవినీతి పాలనను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజల ముందుకు పోతున్న రాహుల్ గాంధీ పోరాటం తట్టుకోలేక మోడీ అధికార బలంతో రాహుల్ గాంధీ కి శిక్ష వేయించి పార్లమెంట్ సభ్యునిగా సస్పెండ్ చేయించడని అన్నారు. కానీ అన్యాయం ఎన్నో రోజులు నిలబడలేదని సుప్రీంకోర్టులో న్యాయం గెలిచిందని సూర్య అన్నారు.
ఈ తీర్పుతో రాహుల్ గాంధీ రాబోయే తరానికి ప్రధాని కావడం ఖాయమని తేటతెల్లమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్, ఐ.ఎన్.టీ.యు.సి జిల్లా అధ్యక్షుడు సుంచు రమేష్, చెలికాని యాదగిరి, బంక చిరంజీవి యాదవ్, తుమ్మల శ్రీనివాస్, అర్జున్, కనకరాజు, అజ్జు యాదవ్, సామల సంతోష్, బాల్ రాజు, అంతగిరి చంద్రశేఖర్, అంకర్ మధు, రాకేష్, బైరి సాయి, అనరాజు నాగరాజు, మున్న, ముర్షద్, బంక చిరంజీవి యాదవ్, కుమార్, జావిద్ లు ఉన్నారు.