కాంగ్రెస్ పార్టీ మత్య్సకార రాష్ట్ర కార్యదర్శిగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు సాయి కుమార్ నియామక పత్రం అందించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ కు శాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా జంగిటి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి ఇచ్చినందుకు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని అన్నారు.
కేసీఆర్ నియంత పాలనను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తానని అన్నారు. ఈ పదవి ఇచ్చినదుకు రాష్ట్ర అధ్యక్షులు మెట్టు సాయి కుమార్ కి సహకరించిన ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్, ఓబీసీ సెల్ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు లక్కరసు సూర్యవర్మకు ధన్యవాదాలు తెలియచేశారు.