సాయిబాబా జన్మ భూమి కర్మ భూమి అంటూ ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రకటనలు చేయబోమని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.షిరిడి సాయిబాబా జన్మస్థలం విషయంలో తలెత్తిన వివాదంపై శివసేన వెనక్కి తగ్గింది. ఇకపై సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని పేర్కొనబోమని, వివాదం సృష్టించే ఉద్దేశం తమకు లేదని పార్టీ పేర్కొంది. శిరిడీ ట్రస్టు ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నిన్న సమావేశమయ్యాయి.
అనంతరం శివసేన నేత కమలాకర్ కోతే మీడియాతో మాట్లాడారు. శిరిడీ సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని ఇకపై పేర్కొనరాదని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో కొత్త వివాదాలకు చోటు లేదని, ఇక ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడినట్టేనని స్పష్టం చేశారు. సీఎంతో చర్చలపై సంతృప్తి చెందినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.ఇక షిరిడీలో బంద్ లు ఇండవని జరిగిన దానికి భక్తులకు క్షమాణాలు చెబుతున్నట్లు షిరిడి ట్రస్ట్ సభ్యులు గ్రామస్తులు తెలిపారు.