సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్యాలయం నుండి పిఎస్ఆర్ సెంటర్ వరకు 1.50 కోట్ల రూపాయలతో మంచి నీటి పైపు లైన్ నిర్మాణం, 4వ,వార్డులో 30 లక్షల DMFT నిధులతో సిసి రోడ్ల నిర్మాణ శంఖుస్థాపన ఎంపి బడుగుల లింగయ్య,ఎంఎల్ఏ శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగుతున్నదని,పట్టణాల మరింత మెరుగైన అభివృద్ధికి ప్రత్యేక నిధులు త్వరలో మంజూరు అవుతాయని అన్నారు.
హుజూర్ నగర్ తహసిల్దార్ కార్యాలయం, కొత్త బస్టాండ్ లో పట్టణ ప్రగతి నిధుల నుండి 20 లక్షల రూపాయలతో నిర్మించిన మరుగుదొడ్లను, పాత గ్రామ పంచాయతీ స్థలంలో రాత్రి సమయంలో వీధులలో పడుకునే శరణార్ధుల కోసం ఏర్పాటు చేసిన ఆశ్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర రావు, ఎంపిపి గుడెపు శ్రీను,జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమరనాద్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి బెల్లంకొండ అమర్, నర్సింగ్ వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్లు , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.