జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు అందుకున్న సందర్భంగా ఫలక్ నుమా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హనుమునాయక్ ను హైదరాబాద్ పాతనగర కవుల వేదిక కన్వీనర్, ప్రముఖ కవి కొరుప్రోలు హరనాథ్ సన్మానించారు. సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం సందర్భంగా హనుము నాయక్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహితతో పాటు మధుబాబు (ఉపాధ్యాయుడు), ఉపాధ్యాయినులు జోస్ మేరి, దేవలపల్లి సునంద పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో పాఠశాల విద్యార్థులు పాల్గొని తాము పెద్దయిన తర్వాత ఏ పెద్ద చదవులు చదవాలో చెప్పి అందరిని ఆశ్చర్య పరిచారు. కొందరు విద్యార్థులు లేచి డాక్టర్లు, ఇంజనీర్లు, ఐ.పీ.ఎస్ లు, ఐ.ఏ.ఎస్ లు కావాలనుకుంటున్నామని చెప్పారు. ఆ చిన్నారులు చిన్నతనంలోనే పెద్ద లక్ష్యాలను పెట్టుకోవడం ఆనందదాయకంగా అనిపించింది. ప్రభుత్వం తరఫున అవార్డు అందుకున్న హనుము నాయక్ పాత నగర కవుల వేదిక కన్వీనర్ హరనాథ్ కు ధన్యవాదాలు తెలిపారు.