ఈనెల 19వ,తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్,పెట్రోల్,వంటగ్యాస్ ధరలు పెంపునకు నిరసనగా ట్రాన్స్పోర్ట్ ఆటో కార్మికులు బందును విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఎం.రాంబాబు కార్మికులు పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని పాత బస్టాండ్ లో ఆటో కార్మికులకు కరపత్రాలు పంచిన అనంతరం రోషపతి,రాంబాబు మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ బిల్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, డీజిల్,పెట్రోల్,వంటగ్యాస్ ధరలు తగ్గించాలని,బిజెపి కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేకుండా చేస్తుందని,ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
పట్టణ, మండల కేంద్రాలో అడ్డాలు ఏర్పాటు చేయాలని,ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు భక్తుల శివ నాగరాజు,రాంబాబు, హనుమంతరావు,బాలు,చందు, సత్యనారాయణ,ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్