విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని వైసీపీ ఎంపీలు కేంద్రహోంమంత్రి అమిత్షాను కోరారు. ఈ మేరకు ఎంపీలు ఆయనకు వినతి పత్రం ఇచ్చారు.
ప్రధాని మోదీ కార్యదర్శికి వైసీపీ ఎంపీలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో సీఎం జగన్ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని అమిత్ షాను కోరామని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరామని, పోలవరంపై సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరామన్నారు.
అమిత్ షా సానుకూలంగా స్పందించారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలని కోరామని ఎంపీ సత్యనారాయణ పేర్కొన్నారు.
దిశ చట్టం ఆమోదించాలని అమిత్షాను కోరామని ఎంపీ వంగా గీత కోరారు.