39.2 C
Hyderabad
May 3, 2024 13: 13 PM
Slider జాతీయం

‘జగన్‌ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని అమిత్‌ షాను కోరాం’

#AmithShah

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని వైసీపీ ఎంపీలు కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కోరారు. ఈ మేరకు  ఎంపీలు ఆయనకు వినతి పత్రం ఇచ్చారు.

ప్రధాని మోదీ కార్యదర్శికి వైసీపీ ఎంపీలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో సీఎం జగన్‌ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని అమిత్‌ షాను కోరామని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు.

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరామని, పోలవరంపై సవరించిన అంచనాలు ఆమోదించాలని కోరామన్నారు.

అమిత్‌ షా సానుకూలంగా స్పందించారని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలని కోరామని ఎంపీ సత్యనారాయణ పేర్కొన్నారు.

దిశ చట్టం ఆమోదించాలని అమిత్‌షాను కోరామని ఎంపీ వంగా గీత కోరారు.

Related posts

ఉత్త‌రాంధ్రను అభివృద్ది చేసింది మేమే…!

Satyam NEWS

ప్రొఫెసర్ కోదండరామ్ కు సి.పి.ఐ (యం.ఎల్) మద్దతు

Satyam NEWS

ఏపిలో టెన్త్ పరీక్షలు రెండు వారాలు వాయిదా

Satyam NEWS

Leave a Comment