రాజోరి (జమ్మూ కాశ్మీర్ ) వద్ద 31 జూలై 2002 న మిలిటెంట్ యాక్షన్ లో కెప్టెన్ రాపోలు వీరరాజారెడ్డి వీరమరణం పొంది నేటితో 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ,మాజీ శాసనసభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, హప్సిగుడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ తో కలిసి కెప్టెన్ రాపోలు వీరరాజారెడ్డికి పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంజయ్ పటేల్, న్యాలకొండ సుమన్ రావు, రంగా రవి, కైలాసపతి గౌడ్, రవీందర్ రెడ్డి, ఎల్లా చారి,రాఘవేందర్ రెడ్డి, హబ్సిగూడ వివిధ కాలనీవాసులు యాదవ రెడ్డి, సుధాకర్ రెడ్డి ,భద్రారెడ్డి ,మల్లారెడ్డి ,శ్రీధర్ రెడ్డి, కాంతాల నారాయణరెడ్డి, కెప్టెన్ వీరారాజు రెడ్డి ఫౌండేషన్ డా.ఆర్. కొండల్ రెడ్డి, మేనేజింగ్ ట్రస్టీ ప్రొ.జి.సురేందర్ రెడ్డి, సెక్రటరీ డా.రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి