భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, దివంగత నేత మద్దిలేటి 21వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి స్వగ్రామం మాధవస్వామినగర్ లోని వారి సమాధి దగ్గర బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇంచార్జ్ సుధాకర్ రావు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలో తీవ్రవాద ప్రభావంతో బీజేపీ కార్యకర్త అని చెప్పుకోవడానికి భయపడే రోజుల్లో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానా బలోపేతం చేసిన వ్యక్తి జామ్ మద్దిలేటి అని కొనియాడారు.
పేద దళిత కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీలో రాష్ట్రస్థాయి నాయకునిగా ఎదిగిన జామ్ మద్దిలేటి నేటితరం పార్టీ నాయకులకు స్పూర్తిదాయకమన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త అవిశ్రాంతంగా శ్రమిస్తూ పార్టీని నియోజకవర్గంలో గెలుపు తీరాలవైపు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి జాం లత,బీజేపీ నేతలు భరత్ చంద్ర,ఖలీల్,ప్రసాద్,మూలే వెంకటేష్, వెంకటస్వామి,శేఖర్ గౌడ్,శ్రీనివాస్ యాదవ్,జలాల శివుడు,భీమేష్ రెడ్డి,సాయికృష్ణ గౌడ్,కడ్తాల కృష్ణ,జాం అశోక్, పెద్దయ్య, శేఖర్ రావు, కురుమయ్య, వారి స్నేహితులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.