హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే గోషామహల్ టిఆర్ఎస్ నాయకులు తన్నుకున్నారు. హైదరాబాద్ రాంకోఠి లోని రూబీ గార్డెన్స్ లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది.
హోంమంత్రి మహమూద్ అలీ గోషామహల్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో ఒక ఉద్యమకారుడు నినాదాలు చేశాడు.
తనను వేదిక పైకి పిలవలేదని ఉద్యమకారుడు ఆర్వి మహేందర్ కుమార్ ముందుగా నిలదీశాడు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హోంమంత్రి సమక్షంలో టిఆర్ఎస్ నాయకులు కొట్టుకున్నారు.
హోంమంత్రి మహమూద్ అలీ గొడవపడుతున్న నాయకులను శాంతింపచేశారు.