38.2 C
Hyderabad
April 29, 2024 21: 42 PM
Slider కడప

వైసీపీ లో చేరలేదనే అక్రమ కేసులు పెడుతున్నారు

KadapaTDP

కడప జిల్లా టీటీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ను రాజంపేట పట్టణ పోలీసులు ఆదివారం కడపలో అదుపులోకి తీసుకున్నారు. కడప నుండి ప్రత్యేక వాహనాల్లో రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

గతంలో రాజంపేట మండలం కూచివారిపల్లి పంచాయతీలో భూముల లావాదేవీల్లో అవకతవకలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు.

రాజంపేట అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పై కడప జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి బాల శెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన,కక్ష సాధింపు పాలన నడుస్తోందన్నారు.

వైసీపీ లో చేరలేదని నాపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.2003లో ఓ సొసైటీ స్థలం అమ్మామని,ఇప్పుడు దానిపై జైలుకు పోయిన వ్యక్తి నాపై తప్పుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారన్నారు.

20 యేండ్ల తరువాత తనపై కేసు పెట్టడం అన్యాయం,దుర్మార్గం అన్నారు. అయినా బెదిరేది లేదని, హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. ఇందులో ఎస్పీ, పోలీసుల తప్పు లేదని అన్నారు.

Related posts

పాఠశాల బస్సు ఢీకొని ఒకరికి గాయాలు

Satyam NEWS

సజ్జల రామకృష్ణా రెడ్డి, వైఎస్ రాజారెడ్డి డిఎన్ఏ ఒకటేనా?

Satyam NEWS

చీకటి రేఖ సాక్షిగా

Satyam NEWS

Leave a Comment