సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల స్థాయి క్రీడల నిర్వహణకై మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల సమావేశం మండల విద్యాధికారి ఐ శాంతయ్య అధ్యక్షతన జరిగింది. మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు పి.ఈ.టిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు మండల వనరుల కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో మండల విద్యాధికారి ఐ శాంతయ్య మాట్లాడుతూ, డీఈవో సూర్యాపేట ,
ఆదేశానుసారం ఆగస్టు 29,30 న జెడ్ ,పి, హెచ్ ఎస్ ,జలాల్ పురంలో నిర్వహించాలని తీర్మానించారు. అలాగే ఈ ఆటల నిర్వహణకు, పిల్లలకు మెమొంటోలు, భోజన సదుపాయాలను సమకూరుస్తున్న దాత ఎమ్మెస్ ఫౌండేషన్ చైర్మన్ ఎం సత్యం కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం కే అశోక్ రెడ్డి, కాంప్లెక్స్ ధానోపాధ్యాయులు, జి అశోక్ , జెడ్పిహెచ్ఎస్ తొండ, డి వెంకట్, ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. బాలరాజు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.