33.2 C
Hyderabad
May 15, 2024 12: 38 PM
Slider రంగారెడ్డి

సంబంధంలేని విషయంలో జర్నలిస్టు భూమేష్ నే వేధిస్తున్న పోలీసులు

#cybarabadpolice

పోలీసుల అనుచిత ప్రవర్తనపై సైబరాబాద్ కమిషనర్ కు TUWJ ఫిర్యాదు

దిశ దినపత్రిక శేరిలింగంపల్లి ఇంచార్జి తుడుం భూమేష్ మీద కెపిహెచ్ బి పోలీసుల వైఖరి, అనుచిత ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలని, భూమేష్ కు అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ)  శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను కలిసి వినతి పత్రం సమర్పించారు.

TUWJ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్, ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, టెంజు అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె.కిషోర్ ల ఆధ్వర్యంలో శేరిలింగంపల్లికి చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ దిశ దినపత్రిక శేరిలింగంపల్లి ఇంచార్జిగా పనిచేస్తున్న తుడుం భూమేష్ మీద KPHB పోలీసులు వేధింపులకు పాల్పడడం హేయమన్నారు. భూమేష్ కు సంబంధం లేని విషయంలో కేపీహెచ్ బి పోలీసులు పలుమార్లు పోలీసు స్టేషన్ కు పిలిపించి, సిఆర్పిసి నోటీసులు తీసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు. 

కేపిహెచ్ బి సిఐ నిజానిజాలు తెలుసుకోకుండా భూమేష్ ను నోటీసులు తీసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. ఇదే క్రమంలో ఏప్రిల్ 23వ తేదీన ఉదయం 9.30 గంటలకు తన ఇంట్లో టిఫిన్ చేస్తున్న భూమేష్ ను కొంతమంది పోలీసులు దౌర్జన్యంగా, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని, కనీసం వచ్చినవారు పోలీసులనే సమాచారం సైతం ఇవ్వకుండా అనైతికంగా, అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి ఫోన్లు లాక్కున్నారన్నారు.

గర్భిణిగా ఉన్న భూమేష్ భార్యకు కనీస సమాచారం ఇవ్వకుండా భూమేష్ ను కేపి హెచ్ బి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి భూమేష్ తో నోటీసులపై సంతకాలు చేయించుకొని, తనకు సంబంధం లేని విషయంలో భూమేష్ ను బాధ్యుడిని చేసేందుకు ప్రశ్నించారన్నారు.

అక్రమాలు, అవినీతి, సామాజిక అంశాలపై గత కొంత కాలంగా వార్తలు రాస్తున్న భూమేష్ ను లక్ష్యంగా చేసుకొని కొంత మంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కేపిహెచ్ బి పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కమిషనర్ కు జర్నలిస్టు నాయకులు వివరించారు. జర్నలిస్టు భూమేష్ ను దౌర్జన్యంగా, అవమానకరంగా పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులపై చర్యలు తీసుకొని, భూమేష్ కు న్యాయం చేయాలని, అతనికి… అతని కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు.

దీనిపై స్పందించిన కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపిస్తానని, మొత్తం వివరాలు తీసుకొని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు భూమేష్ కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. సైబరాబాద్ కమిషనర్ ను కలిసిన వారిలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులతో పాటు దాదాపు 60మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related posts

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు తక్షణమే పెంచాలన్న సిఐటియు

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు తీవ్రగాయాలు

Satyam NEWS

“బ‌జార్ రౌడి” తో స్టెప్పులేయించిన ప్రేమ్ ర‌క్షిత్‌

Satyam NEWS

Leave a Comment