34.2 C
Hyderabad
May 14, 2024 22: 50 PM
Slider సినిమా

టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య

#KondapallyShravani

తెలుగు టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి మంగళవారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నది. మంగళవారం రాత్రి బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బాత్రూంలోకి వెళ్లిన శ్రావణి ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా శ్రావణి విగత జీవిగా పడి ఉన్నట్లు గమనించారు.

వెంటనే ఆమెను యశోద హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల మధుర నగర్ హెచ్ 56 బ్లాక్ రెండవ ఫ్లోర్‌లో శ్రావణి నివసిస్తున్నది.

కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పదిందని, ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

గత కొంతకాలంగా శ్రావణిని దేవరాజ్ రెడ్డి వేధిస్తున్నాడని అందువల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నదాని వారు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రావణి గత ఎనిమిది సంవత్సరాల నుండి తెలుగు టీవీ సీరియల్స్ అయిన మౌనరాగం, మనసు మమత, పలు సీరియళ్లలో నటిస్తోంది.

Related posts

కోయపోచగూడలో కొత్తగా చేస్తున్న అటవీ ఆక్రమణలను మాత్రమే అడ్డుకున్నాం

Satyam NEWS

గాన గాంధర్వుడు తుది శ్వాస తీసుకున్న తీరు ఇది…

Satyam NEWS

మండలి వైస్ ఛైర్మన్ కు  ఎంపీ వద్దిరాజు అభినందన

Satyam NEWS

Leave a Comment