30.7 C
Hyderabad
April 29, 2024 03: 14 AM
Slider ముఖ్యంశాలు

మాజీ ప్రధాని పి.వి. పై కవితలకు ఆహ్వానం

#PVNarasimharaoSatajayanti

భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహ్మారావు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ పాతనగర కవుల వేదిక, లాల్ దర్వాజ ఆధ్యర్యంలో ఒక కవితా సంకలనం ఆవిష్కరించాలనుకుంటున్నట్లు కన్వీనర్ కె.హరనాథ్ తెలిపారు.

ఈ సంకలనం ఈ ఏదాడి డిసెంబర్ లో వస్తుంది. ఈ సందర్భంగా ఆయనపై కవితలను ఆహ్వానిస్తున్నామని హరినాథ్ తెలిపారు. కవితలు 20 లైన్లకు మించకుండా వుండాలి.

ఈ కవిత నా స్వంతమే, ఎక్కడ ప్రచురణకాని, ప్రసారంకాని కాలేదని హామీనిస్తూ, 20, సెప్టెంబరు 2020 లోగా, 9703542598 కు గాని 9182178653 కి గాని వాట్స్ యాప్ కి పంపాలని ఆయన కోరారు.

ఎన్నికైన కవితల్లో ఉత్తమ ప్రథమ కవితకి 3,116/- లు, ద్వితీయ కవితకి 2,116/-లు, తృతీయ కవితకి 1,116/-లు గా, ఇవే కాకుండా మరో పది కవితలకు కన్సొలేషన్ బహుమతులు ఇస్తామని ఆయన తెలిపారు.

ఈ సంకలనం, బహుమతులను డిసెంబర్ లో జరిగే ఆయన వర్ధంతి సందర్భంగా ఇస్తామని ఆయన అన్నారు.

Related posts

అటవీ అనుమతులపై రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు భేటీ

Satyam NEWS

టీటీడీ డిసిషన్:85 టన్నుల నాణాలను కరిగిస్తాం

Satyam NEWS

రామతీర్థం బొడికొండకు ప్రముఖుల తాకిడి

Satyam NEWS

Leave a Comment