ప్రతిభ ఉన్న విద్యార్ధులను ప్రోత్సహించేందుకు ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ ముందు ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టి ప్పలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన సుస్మిత పదవ తరగతి లో 10/10 మార్కులు సాధించారు.
ఉన్నత చదువుల కోసం ఆర్థిక స్తోమత లేని ఆ కుటుంబానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలిచారు. ఆమె ప్రతిభను గుర్తించి ఉన్నత చదువుల కోసం కార్పోరేట్ కళాశాలలో చేర్పించారు.
ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న విద్యార్థులు పై చదువుల కోసం వారి వారి ఆర్థిక స్తోమత అడ్డు రాకూడదని అన్నారు.
ఇటువంటి వారికి ఎల్లవేళలా తోడుంటానని విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట లైన్స్ క్లబ్ రామ్ రెడ్డి ఉన్నారు.