హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా పని చేస్తామని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు.
సనత్ నగర్ టిడిపి అభ్యర్ధి కానూరి జయశ్రీ తరపున నేడు ఆమె విస్త్రతంగా ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలతో బాటు సంక్షేమాన్ని సమతూకంలో అందించేది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు.
డబ్బు వెదజల్లే రాజకీయం కాకుండా పేద ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకులను ఎన్నుకోవాలని కాట్రగడ్డ ప్రసూన ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కాట్రగడ్డ ప్రసూనతో బాటు సనత్ నగర్ ఇన్ చార్జి కసిరెడ్డి శేఖర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ బిసి సెల్ ప్రెసిడెంట్ శ్రీపతి సతీష్, వెంకటరమణారెడ్డి తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.