40.2 C
Hyderabad
April 28, 2024 16: 36 PM
Slider ప్రకాశం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి

#DarshiKurcheduRoad

ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నాయకుడి లక్షణం. ఎన్నికలలో చెప్పిన పనులు ఒక్కొక్కటిగా చేయడం దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రత్యేకత. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న దర్శి నుంచి కురిచేడు డబల్ రోడ్డుకు నేడు ఆయన శంకుస్థాపన చేశారు.

ప్రకాశం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగమైన ఈ రోడ్డును  24 కోట్ల 50 లక్షల తో నిర్మించనున్నారు. రోడ్డు పనులకు దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరు మండల ఇన్ ఛార్జ్ మద్దిశెట్టి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఎన్నో ఏళ్లుగా కురిచేడు మండల ప్రజలు ,దర్శి మండల ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కురిచేడు దర్శి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయంలో భౌతిక దూరం పాటించడం గమనార్హం.

Related posts

కేసీఆర్ పై నేనే పోటీ చేస్తా: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

అస్వస్థతకు గురైన బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి

Satyam NEWS

ప్రతి ఉపాధ్యాయుడు ఆంగ్ల శిక్షణలో పాల్గొనాలి

Satyam NEWS

Leave a Comment