నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని మార్చల గ్రామంలో పది రోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన ఇబ్రహీం కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఉప్పల ట్రస్ట్ ప్రకటించింది.
వారి కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని ట్రస్ట్ సభ్యులు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇబ్రహీం కుమారునికి చదువుకు అయ్యే ఖర్చులు పూర్తిగా చూసుకుంటానని భరోసా కల్పించారు.
అట్టడుగు బలహీన వర్గాల ప్రజలకు చేయూతనందించేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్చాల గ్రామ సర్పంచ్ ఆవ మల్లయ్య, వార్డు సభ్యులు భాస్కర్ తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ వెల్జాల్ ఉపసర్పంచ్ అజీజ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శశికుమార్ గౌడ్ నాయకులు దస్తగీర్ సురేష్ ట్రస్టు సభ్యులు బుచ్చిబాబు దివాకర్ తదితరులు పాల్గొన్నారు.