శ్రీవసంత పంచమి సందర్భంగా విజయనగరం లో ఎస్వీఎన్ నగర్ లోని జ్ఞాన సరస్వతీ దేవాలయంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం లో ఉన్న బాసర సరస్వతీ పుణ్య క్షేత్రాన్ని తలపించే విధంగా జ్ఞాన సరస్వతీ దేవాలయం లో పూజ లు జరిగాయి.
తెల్లవారుజామున జ్ఞాన సరస్వతీ టెంపుల్ లో అమ్మవారికి పూజలు జరిగాయి.
ఉదయం ఏడుగంటల ప్రాంతంలో దాదాపు అయిదువేల మంది చిన్నారులతో ఆలయమండపంలో అక్షరాభ్యాసం చేయించారు.. ఆలయ అర్చకులు.
ఆలయం మొత్తం చిన్నారుల తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. చిన్నారులచే పలకమీద బియ్యపు గింజలమీద..ఓం..అమ్మ ,ఆవు అక్షరాలను పిల్లలచే కన్నవారి ద్వారా ఆలయ అర్చకులు దిద్దించారు.
ఈ కార్యక్రమంలో.. ఆలయ కార్యదర్శి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.