గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో మహిళల రక్షణ కోసం దిశ మహిళా పోలీస్ స్టేషన్ ను నేడు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే విడదల రజనీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, ఐజి వినీత్, రూరల్ ఎస్పీ విజయరావు, డీఎస్పీ లు వీరారెడ్డి, శ్రీలక్ష్మి లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా మహిళా పోలీసులు హోంమంత్రి కి గౌరవ వందనం చేశారు.