నిత్యం వేద ఘోషతో దిన దిన ప్రవర్ధమానమవుతున్న శ్రీ లక్ష్మీనృసింహ వేద,స్మార్త పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలలో శనివారం ‘ శ్రీ పంచమి ‘(వసంత పంచమి)ని పురస్కరించుకుని వేద పాఠశాల అధ్యాపకుడు చీమలపాటి ఫణి శర్మ ఘనాపాటి,స్మార్త పండితులు తేజోమూర్తుల రవిశర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ నిర్వహించి చదువుల తల్లి సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముక్త కంఠంతో వేద అధ్యాపకులు,వేద విద్యార్థులు పంచసూక్తాలతో సరస్వతీ మాతను ఆరాధించి షోడశోపచారాలతో అర్చించారు.అనంతరం మహా నివేదన,మహా మంత్రపుష్పం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వేద పాఠశాల కమిటీ సభ్యుడు బాచిమంచి చంద్రశేఖర్, శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ ఉపాధ్యక్షుడు నారపరాజు పురుషోత్తమరావు,కోశాధికారి బాచిమంచి గిరిబాబు,సభ్యులు రంగరాజు వాసుదేవరావు,భువనగిరి శ్యామ్ సుందర్,ధూళిపాళ రామకృష్ణ,పులిజాల శంకర్రావు,వేద, స్మార్త విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్