హైదరాబాద్ లోని మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ మంగాపురం కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో స్వామివారి కళ్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ లు పాల్గొని స్వామి వారికి నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఆలయ ఈ ఒ. వెంకన్న తో ఆలయ సిబ్బంది వివిధ కాలనీల నుండి వచ్చిన భక్తులు, టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి