ఈ నెల 17న హైదరాబాద్ తుక్కగుడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించనున్న విజయ భేరి సభ విజయవంతానికై జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జావిద్ అధ్యక్షతన నగర కాంగ్రెస్ కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎఐసిసి అబ్జర్వర్, మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్ నసీం ఖాన్, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ లు హాజరయ్యారు.
ముందుగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గం నుండి అత్యధికమంది విజయభేరి సభకు హాజరు కావాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియమ్మ తెలంగాణకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఖమ్మం నగర కాంగ్రెస్ తరపున సోనియమ్మకు ఘన స్వాగతం పలకాలని నగర మాజీ, ప్రస్తుత కార్పొరేటర్ లను, డివిజన్ అధ్యక్షులకు పిలుపునిచ్చారు.
అనంతరం మహమ్మద్ ఆరిఫ్ నసీంఖాన్ మాట్లాడుతూ…. రాబోవు అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని యావత్ దేశం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటుందని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రివర్యులు రేణుక చౌదరి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 8 నుండి పదివేల మంది జనాభాతో విజయభేరి సభకు హాజరుకావాలని కోరారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడదామని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విజయ భేరి సభకు అన్ని మండలాల, బ్లాక్ అధ్యక్షులు భారీగా తరలిరావాలని, తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్లు మలిదు వెంకటేశ్వర్లు, లాకావత్ సైదులు, కొప్పెర ఉపేందర్, దుద్దుకురి వెంకటేశ్వర్లు, మలిధు జగన్, బీసి సెల్ జిల్లా అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రo , మాజీ మార్కెట్ చైర్మన్ మనుకొండ రాధ కిషోర్, చోటే బాబా, వడ్డే బోయిన నరసింహారావు, మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవికుమార్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపా అధ్యక్షుడు కొంటే ముక్కుల నాగేశ్వరావు, రఘునాథ పాలెం మండల అధ్యక్షులు భూక్యా బాలాజీ , తది తరులు పాల్గొన్నారు