శుభకార్యానికి వచ్చిన ఓ యువతిని నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు .ఆ యువతిని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులుసామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.తీవ్రంగా గాయపడ్డ యువతీ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గత ఏడాది డిసెంబరు 24న ఆమె మండలంలోని ఓ గ్రామంలో శుభకార్యానికి వెళ్లింది. అదే రోజు రాత్రి ఆమెపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనారోగ్యానికి గురవడంతో మాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందాడటం తో పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.