విజయనగరం ప్రజలంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అభిలషించారు. తన జన్మదినం సందర్భంగా శనివారం నాడు ఎమ్మెల్యే కోలగట్ల కుటుంబసమేతంగా అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రత కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే కోలగట్ల కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యే కోలగట్ల కు స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరింత శక్తిని ప్రసాదించాలని, ప్రజారంజక పాలన లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు ఎమ్మెల్యే కోలగట్ల తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న వారిలో ప్రముఖ వ్యాపారవేత్త గుడిసే శ్రీనివాస రావు దంపతులు, విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం పాలక మండలి సభ్యులు ఎం కె బి శ్రీను దంపతులు, ఆలవెల్లి మురళి దంపతులు, అగ్రహారపు వాసు దంపతులు ఉన్నారు.