తెలంగాణ లో రాజకీయంగా బలపడే దమ్ములేకనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కులమతాల మధ్య చిచ్చురేపే విదంగా మాట్లాడుతున్నాడని పిసిసి భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో పిసిసి సభ్యులు హైమద్ తో కలసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ హిందువులను, ముస్లిం లను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఒకప్పుడు కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాలు అని మట్లాడితే ఈనాడు బండి సంజయ్ మజీదులను కూల్చాలని మాట్లాడుతూ హిందువుల ముస్లిం లను రెచ్చగొడుతున్నారని అన్నారు. బండి సంజయ్ దేశ అభివృద్ధి గురించి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఒవైసీ, బండి సంజయ్ లు కావాలంటే ఓ గ్రౌండ్ చూసుకొని కొట్లాడుకోండి మీ బలాబలాలు తెలుసుకోండి అంతేగాని కులమతాల మధ్య విభేదాలు తీసుకొచ్చి దేశాన్ని వల్లకాడు చేయద్దని అన్నారు.
రెండు పర్యాయాలు అధికారంలో ఉండి బిజెపి, టీఆరెస్ ప్రభుత్వాలు ప్రజాభివృద్ధి కోసం ఏంచేశారో చెప్పాలన్నారు. మిమ్ములను నమ్మి ఓట్లేస్తే పది సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని రైతుల సబ్సిడీలు ఇవ్వకపోగా పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని గివ్వి చేసే సోయి లేదు కానీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతారని అన్నారు.