అండాండ పిండాండ బ్రహ్మాండనాయకులు శ్రీ లక్ష్మీనరసింహ దేవాలయం ప్రారంభోత్సవానికి గోడపత్రికను వెంకటేష్ విడుదల చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ సీతారామ ప్రియ భక్తుడు ఆంజనేయ స్వామి ఆలయం మే 10వ తేదీన ప్రారంభోత్సవం సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి చేత గోడ పత్రికను విడుదల చేశారు. తలకొండపల్లి జెడ్ పి టి సి, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తమ ట్రస్టు ద్వారా సొంతంగా నిర్మాణం చేపట్టినా దేవాలయ ప్రారంభోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు చేరుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తీర్థ ప్రసాదములు స్వీకరించాలని ఆయన కోరారు.
previous post
next post