త్వరలో పదవీకాలం ముగియ బోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగించారు.
రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఈనెల 30తో సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ పదవీకాలం ముగియబోతుండగా ఈ పొడిగింపు వచ్చింది.
దాంతో ఆయన సీఎస్ గా సెప్టెంబరు 30 వరకూ కొనసాగనున్నారు.