నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మునిసిపాలిటీలో అక్రమ కట్టడాలకు బాధులెవరో వెల్లడించాల్సిన అవసరం ఉందని 10వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ షేక్ రహీమ్ పాష డిమాండ్ చేశారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల బస్ డిపో దగ్గర అక్రమ కట్టడాలను నేడు మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. అసలు ఆ అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అక్రమ నిర్మాణాలకు సహకరించింది ఎవరు? నకిలీ పత్రాలు సృష్టించి పేద ప్రజలను మభ్యపెట్టింది ఎవరు? అనే విషయాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ స్థలాలలో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పి కొందరు డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై అధికారులు తక్షణమే వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. తాను వేస్తున్న ఈ ప్రశ్నలకు సంబంధిత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లేదా ఆయన కు చెందిన నాయకులు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని షేక్ రహీమ్ పాష అన్నారు.
ఈ కూల్చివేత సంఘటనకు సంబంధించి అమాయక ప్రజలు బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనక హస్తం ఉన్న వారి పేర్లు బయట పెట్టి నిజాయితీ చాటుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అక్రమాలకు కారణమైన వారిని దాచి పెట్టి అమాయకులను ఇబ్బంది పెట్టరాదని ఆయన అన్నారు.
అదేవిధంగా పైసలకు కకుర్తి పడి అక్రమ కట్టడాల కు పర్మిషన్ ఇచ్చిన అధికారుల పై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి పేదలను మోసం చేసిన వారి పేర్లు బయటపెడితే భవిష్యత్తులు వారి చేతుల్లో మరింత మంది పేదల మోసపోకుండా ఉంటారని షేక్ రహీమ్ పాష అన్నారు.