ఈ పెద్దాయనను చూసిన వారెవ్వరైనా అయ్యో పాపం అనాల్సిందే.దిక్కూమొక్కూ లేక అనాధగా పడి ఉన్నాడు..కాదు కాదు…మృతి చెందడంతో ఇలా వదిలేసి వెళ్లారు.
అటుగా వెళ్లిన కొందరు ఈ పెద్దాయన ఫోటో తీసి సోషల్ మీడియా పోస్ట్ చేసారు.అదీ కాస్త వైరల్ అయ్యింది.
ప్రస్తుతం కరోనా కొరలు చాచుతున్న తరుణంలో ఎవ్వరి వద్దకూ ఎవ్వరూ వెళ్లొద్దని పెద్ద పెద్ద సైంటిస్టులు,డాక్టర్లు ,మేథావులు సూచిస్తున్న తరుణంలోనే ఈ పెద్దాయన మృతదేహాన్ని చూసిన వారు ఏ ఒక్కరూ దగ్గరకు వెళ్లేందుకు తరలించేందకు సాహసించడం లేదు.
ఈ హృదయ విదాకరమైన దృశ్యం విశాఖలోని విమ్స్ దగ్గర అంబులెన్స్ లో తెచ్చి ఎవ్వరో వదిలిపోయారు.ఆరుపదుల వయస్సు పైబడిన ఈ పెద్దాయన ఓ తండ్రిగా ఎన్ని బరువు బాధ్యతలు మోసి ఉంటాడు.
అయితే ఏ ఒక్కరైనా ఇతగాని బాధను గుర్తించ లేదా…? లేక ఇతగాని ప్రవర్తన నచ్చక వదిలేసి వెళ్లిపోయారా…? ఏదైనా ప్రతీ ఒక్కరూ పుట్టేటప్పుడు ఎప్పుడు బయటపడతామో అని వాళ్ల వాళ్ల కన్నవాళ్లు,బంధువులు ఎదురు చూస్తారు..
కాని అవసాన దశలో ఏ ఒక్కరైనా తమను ఆదుకోక పోతారాని ప్రతీ ఒక్కరూ ఎదురు చూడటం సర్వ సాధరణమే.కాని ఈ పెద్దాయన అర్ధాంతర మృతి..బందువులకు నచ్చలేదా..? లేక తెలయదా..? ఏదైనా ప్రభుత్వవైద్యశాల వద్ద ఎవ్వరూ లేని అనాధైన ఈ పెద్దాయనెవరో ఆ దేవుడికే తెలియాలి…!