బిచ్కుంద మండలంలోని ఫత్లపూర్ గ్రామంలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న శనగ కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే పరిశీలించి, అనంతరం కరోనా వైరస్ నేపథ్యంలో హమాలీలకు మాస్కులు పంపిణీ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ నియమాలను పాటిస్తూ, ప్రతి ఒక్కరు తప్పకుండా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు.
తూకం చేసే కూలీలందరూ తప్పకుండా మాస్కులు ధరించి తూకం చేయాలనీ, శనగల విక్రయానికి రైతులెవ్వరు ఆందోళన చెందరాదని కోరారు. కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సొసైటీ సీఈవో ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ హింగు అరుణ్ కుమార్, సొసైటీ వైస్ చైర్మన్ యదవ్ రావు ,ఉప సర్పంచ్ శివకాంత్, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.