కేసీఆర్ దార్శనికత, కేటీఆర్ దిశ నిర్దేశకత్వంలో తెలంగాణాలో 9 ఏళ్లలో ప్రపంచాన్ని అబ్బురపరిచే రీతిలో బ్రహ్మాoడమైన అభివృద్ధి జరిగిందని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
పండుగ వాతావర ణంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత అధ్యక్షతన మధిరలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడారు. కేసీఆర్ విప్లవాత్మకమైన సరికొత్త ఆలోచనలు , సంస్కరణల ఫలితంగానే దేశంలోనే నెంబర్ వన్ అభివృద్ధి జరుగిందని అన్నారు.
మున్సిపాలిటీలు, కార్పిరేషన్లు అనూహ్య ప్రగతిలో దూసుకుపోతు న్నాయని అన్నారు.వైకుంఠ దామాల నిర్మాణం ఒక చరిత్ర అన్నారు. తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారని అన్నారు.ప్రపంచమే అబ్బురపడే విధంగా హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు.
రాబోయే కాలంలో కేసీఆర్ కు మరింత అండగా ఉండి,మంచి మెజార్టీతో గెలిపించుకొని , మరింత అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరారు. జిల్లాలోని 10 సీట్లను గెల్చుకొని కేసీఆర్ కు బహుమతిగా ఇద్దామని నామ అన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులను సన్మానించారు.