40.2 C
Hyderabad
April 28, 2024 17: 33 PM
Slider కర్నూలు

అవినీతి పార్టీ వైకాపా: బీజేపీ ఎంపి కే లక్ష్మణ్

#MP K Laxman

దేశంలో కాంగ్రెస్ పార్టీ కమిషన్ల పార్టీ, రాష్ట్రంలో వైకాపా పార్టీ అవినీతి పార్టీ అని బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్ అన్నారు. కర్నూల్ నగరంలోని ప్రముఖ హోటల్ లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర అనంతరం ఈ దేశాన్ని నెహ్రూ కుటుంబ పాలన లో 60 సంవత్సరాలు అభివృద్ధి

చెందలేదని బిజెపి పార్టీ అధికారం చేపట్టి 9 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో ప్రజలకు నేరుగా 20 లక్షల కోట్లు వారి ఖాతాలోకి జమ చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెందుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పనిలోనూ కమిషన్లు ( వాటాలు ) పంచుకున్నాయే తప్ప

ప్రజలకు ఒరిగిందేమీ లేదని దేశంలో కరోనా లాంటి కష్ట కాలంలో కూడా మన దేశంలో కరోనాకు టీకాలు కనుగొని ప్రపంచానికే ఆదర్శంగా భారతదేశం నిలిచిందని అన్నారు. ప్రపంచ దేశాల నాయకుడు నరేంద్ర మోడీ జీనే ప్రపంచానికి బాస్ అని కొనియాడుతున్నారని ఆయన అన్నారు.

భారతదేశంలో బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి డబల్ ఇంజన్ వలె దూసుకుపోతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఓబీసీ మోర్చా కార్యదర్శి డాక్టర్ పార్థసారథి, ఆంధ్రప్రదేశ్ బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు పొలంకి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Related posts

డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Bhavani

తెలంగాణ తో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ షురూ

Bhavani

అందరికీ మేలుకలిగేలా నదుల అనుసంధానం

Satyam NEWS

Leave a Comment