తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వెండి ఆవు, దూడ ను ఒక భక్తుడు కానుక గా ఇచ్చాడు. వీటి బరువు ఏడున్నర కిలోల వరకూ ఉంటుంది. తిరుపతికి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు ఈ ఆవు, దూడ ప్రతిమను విరాళంగా అందించారు. వీటి విలువ రూ.3.75 లక్షల వరకూ ఉంటుంది. భక్తుడు ఈ వెండి ప్రతిమను ఆలయ సూపరింటెండెంట్, ప్రధాన అర్చకులకు అందించారు. ఈ ప్రతిమను శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల అలంకరణలో ఉపయోగించాలని భక్తుడు కోరారు.
previous post